Tollywood: అమెరికా సెక్స్‌ రాకెట్‌లో అప్రూవర్లుగా మారిన ముగ్గురు అగ్ర తారలు!

  • హీరోయిన్లను ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
  • తమకు తెలిసిన వివరాలన్నీ వెల్లడించిన మహిళా నటులు
  • కిషన్ దంపతులపై బిగుస్తున్న ఉచ్చు

అమెరికాలో మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ నిర్వహించిన సెక్స్ రాకెట్ లో భాగమైన టాలీవుడ్ హీరోయిన్లను 6 గంటల పాటు అమెరికా అధికారులు ప్రశ్నించగా, వీరు అప్రూవర్లుగా మారి తమకు తెలిసిన సమాచారమంతా వారికి చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు అసోసియేషన్ పత్రాలపై యూఎస్ కు వెళ్లిన వీరిలో బెంగళూరు, చెన్నైకు చెందిన ఇద్దరు అగ్రతారలు, ఫ్లాప్‌ అయిన ద్విభాషా చిత్రంలో నటించిన హీరోయిన్, ఈ మధ్యే బీజేపీలో చేరిన ఓ చిన్న నటి, కొన్ని తెలుగు బ్లాక్‌ బస్టర్స్‌ హిట్స్ లో నటించిన కన్నడ నటి, పలు సినిమాల్లో నటించినా పేరు తెచ్చుకోవడంలో విఫలమైన మరో హీరోయిన్‌ ఉన్నారు.

వీరు తెలుగు అసోసియేషన్ పత్రాలపై అమెరికాకు వెళ్లగా, కొన్ని వీసాలు హైదరాబాద్ కాన్సులేట్ నుంచే లభించాయి. కిషన్ చేతిలో చిక్కుకున్న ఓ నటి వాంగ్మూలం ఇస్తూ, తాను గత డిసెంబర్ 26న అమెరికాకు వెళ్లానని, పెన్సిల్వేనియాలో జరిగే నృత్య ప్రదర్శనకు పిలిచిన కిషన్, బలవంతంగా వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారని ఆరోపించింది. తాను వ్యభిచారం చేయలేదని, కస్టమర్లున్న గదిలో అరగంట సేపు బలవంతంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. మరో నటి మాట్లాడుతూ, చికాగోకు తనను పిలిపించిన కిషన్, మూడు నగరాలకు తిప్పారని, హోటల్ లో ఉంచి కస్టమర్లను పంపించే వాడని చెప్పింది. ఈ విషయాలు ఎక్కడైనా చెబితే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని వాపోయింది.

మరో నటి మాట్లాడుతూ, కిషన్ భార్య చంద్రకళ తనను హోటల్ కు తీసుకెళ్లి కస్టమర్లకు పరిచయం చేసి, పది నిమిషాల తరువాత వెళ్లిపోయేదని, ఆ తరువాత తనను తిరిగి వెనక్కు రప్పించేదని, రెండు ప్లాట్లతో ఉన్న కిషన్ ఇంట్లో ఒకదానిలో కిషన్, చంద్రకళ ఉండేవారని, రెండోదానిలో తనను ఉంచి విటులను పంపేవారని, తిరిగి వచ్చేందుకు వేరే మార్గం లేక వ్యభిచారం చేయాల్సి వచ్చిందని వాపోయింది.

More Telugu News