viral photos: అక్కాచెల్లెళ్లతో జాహ్నవీ కపూర్ సెల్ఫీలు.. వైరల్‌!

  • 'ధడక్' సినిమాలో నటించిన జాహ్నవి  
  • తాజాగా లండన్‌ టూర్‌కు
  • అన్షులా, ఖుషీలతో ఫొటోలు

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ కూతుళ్ల ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం సినీనటి శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్‌, ఖుషీ కపూర్‌లతో బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా శౌరి కపూర్‌ పిల్లలు అన్షులా, అర్జున్‌ కపూర్‌లు కలిసిమెలసి ఉంటున్నారు.

 ధర్మ మూవీస్ బ్యానర్ పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవీ కపూర్ హీరోయిన్‌గా, యువనటుడు ఇషాన్ హీరోగా రూపొందుతోన్న 'ధడక్' సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి విదితమే. ఈ ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమంలో కూడా బోనీ కపూర్‌ కుటుంబ సభ్యలందరూ పాల్గొని జాహ్నవీని అభినందించారు.
 
ప్రస్తుతం సమయం దొరకడంతో బోనీ కపూర్‌ కుమార్తెలందరూ కలిసి లండన్‌లో ఉన్నారు. జాహ్నవి తన సోదరీమణులు అన్షులా, ఖుషీలతో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోనీ కపూర్‌ పెద్ద కుమార్తె అన్షులా కపూర్‌ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.      
 
                           

More Telugu News