nagachaithanya: 'బాహుబలి'కి వర్క్ చేసిన టీమ్ తో 'సవ్యసాచి' విజువల్ ఎఫెక్ట్స్ పనులు

  • చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • హైలైట్ గా మాధవన్ విలనిజం    

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై .. నిధి అగర్వాల్ కథానాయికగా ఈ సినిమా నిర్మితమవుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఒక వైపున డబ్బింగ్ పనులను .. మరో వైపున విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులను మొదలుపెట్టేశారు.

గతంలో 'బాహుబలి' సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందించిన 'మకుట' సంస్థవారే ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందిస్తుండటం విశేషం. కథ .. కథనాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు. చైతూ నటన.. మాధవన్ విలనిజం .. హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.      

More Telugu News