Suryapet District: వేములపల్లిలో మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం

  • చివ్వెంల పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న బాలూనాయక్
  • వాహనాల తనిఖీ పేరిట వసూళ్లు
  • ఓ జంటను ఆపి డబ్బు వసూలు..ఆపై అత్యాచారం

సూర్యాపేట జిల్లాలో ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. వేములపల్లిలో మహిళపై అత్యాచారం చేశాడు. చివ్వెంల పీఎస్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా బాలూనాయక్  పని చేస్తున్నాడు. వాహనాల తనిఖీ పేరిట వసూళ్లకు పాల్పడే బాలూ నాయక్ ఈ క్రమంలో ఓ జంటను ఆపాడు. వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసుకున్న అనంతరం, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలూ నాయక్ ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News