temples: దేవాలయాల్లో క్షురకులు తక్షణం తమ సమ్మె విరమించాలి: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ

  • మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు
  • దేవాలయాల్లో క్షురకుల సమస్యలు పరిష్కరిస్తాం
  • ఈ నెల 18న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవాలయాల్లో క్షురకులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. క్షురకులు తక్షణం తమ సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే నిమిత్తం అధికారులు, క్షురకులతో ఈ నెల 18న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. మొక్కులు తీర్చుకునే నిమిత్తం వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని,  తమ సమ్మెను విరమించాలని ఈ సందర్భంగా కేఈ కోరారు. 

More Telugu News