partitala: పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో క్రిమినల్స్ గ్యాంగ్స్: వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

  • శ్రీరామ్ నేతృత్వంలో పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటయ్యాయి
  • పరిటాల వర్గీయులు విచ్చల విడిగా నేరాలకు పాల్పడుతున్నారు
  • హత్యలు, కిడ్నాప్ లను పరిటాల సునీత ప్రోత్సహిస్తున్నారు

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పై వైసీపీ రాప్తాడు ఇన్ చార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని, పరిటాల వర్గీయులు విచ్చల విడిగా నేరాలకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.

ఈ కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. హత్యలు, కిడ్నాప్ లను పరిటాల సునీత ప్రోత్సహిస్తున్నారని, ఆమెను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, వైసీపీ నాయకుడు, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ, టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, టీడీపీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆరోపించారు. 

More Telugu News