ramzan: 12.5 లక్షల ముస్లింలకు రంజాన్ తోఫా: ఏపీ మంత్రి ప్రత్తిపాటి

  • రంజాన్ శుభాకాంక్షలు 
  • సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక
  • ఉపవాసాలుండే వారు అల్లా కృపకు పాత్రులవుతారు
  • ముస్లింలు పేద, నిస్సహాయులకు సేవలు చేయడం ప్రారంభించారు

ముస్లింలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుతారని, ఈ నెల ప్రారంభంలోనే ముస్లింలు పేద, నిస్సహాయులకు సేవలు, దానాలు చేయడం ప్రారంభించారని తెలిపారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. అలాగే, 12.5 లక్షల పేద ముస్లింలకు 5 కేజీల గోధుమపిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి రూ. 17ల విలువ కలిగిన క్యారీ బ్యాగ్‌ను రంజాన్ తోఫా కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News