kalyani priyadarshan: మెగా హీరో జోడీగా కల్యాణి ప్రియదర్శన్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్ 
  • ఆ తరువాత సినిమా కిషోర్ తిరుమలతో 
  • హీరోగా సాయిధరమ్ తేజ్  

'హలో' సినిమాతో తెలుగు తెరకి కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో కల్యాణి ప్రియదర్శన్ ను ఒక్కసారిగా అవకాశాలు పలకరించలేదు. అయితే నటన పరంగా .. గ్లామర్ పరంగా యూత్ ను ఆకట్టుకోవడంతో, శర్వానంద్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది.

ఈ సినిమా తరువాత కల్యాణి ప్రియదర్శన్ .. సాయిధరమ్ తేజ్ జోడీగా మరో ప్రాజెక్టును అంగీకరించిందనేది తాజా సమాచారం. సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగును ఆరంభిస్తారు. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే, మరిన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తాయని చెప్పచ్చు.         

More Telugu News