Chandrababu: చంద్రబాబు రాసిన లేఖపై నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడి స్పందన

  • నీతి అయోగ్‌ సమావేశాన్ని ఒక్కరోజు వాయిదా వేయాలని లేఖ
  • ఇప్పటికే ఓసారి వాయిదా వేశామన్న నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు
  • మళ్లీ వాయిదా వేయడం బాగోదని వ్యాఖ్య

ఇటీవల నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాస్తూ ఈ నెల 17 ఉదయం జరగాల్సిన నీతి ఆయోగ్ గవర్నింగ్ సమావేశాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేయాలని కోరిన విషయం తెలిసిందే. 16న రంజాన్, 17న ఉదయం ఈద్ మిలాప్ ఉండడంతో చంద్రబాబు ఆ సమావేశాన్ని వాయిదా వేయమన్నారు. ఆయన రాసిన లేఖపై స్పందించిన నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ స్పందిస్తూ... ఇప్పటికే ఈ సమావేశాన్ని ఓసారి వాయిదా వేశామని, మళ్లీ వాయిదా వేయడం బాగోదని చెప్పారు.

కాగా, ఎల్లుండి జరగనున్న ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశంపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే తమ ఎంపీలతో చర్చించారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోనులో మాట్లాడారు. 

More Telugu News