adavi shesh: విడుదల తేదీ ఖరారు చేసుకున్న 'గూఢచారి'

  • అడవి శేష్ హీరోగా 'గూఢచారి'
  • కథానాయికగా శోభిత ధూళిపాళ 
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్

అడవి శేష్ కథానాయకుడిగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో 'గూఢచారి' సినిమా రూపొందింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. శోభిత ధూళిపాళ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా 'సుప్రియ' రీ ఎంట్రీ ఇస్తోంది.

ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ దిశగానే మిగతా పనులు చకచకా జరిగిపోతున్నాయి. విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయని అంటున్నారు. 'అమీతుమీ' తరువాత తాను చేసిన ఈ సినిమా, తనకి మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని అడవి శేష్ భావిస్తున్నాడు. ఇక శోభిత ధూళిపాళకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందేమో చూడాలి.   

More Telugu News