saidfharam tej: విశాఖలో 'తేజ్ ఐ లవ్ యూ' ఆడియో సక్సెస్ మీట్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ'
  • కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ 
  • జూలై 6వ తేదీన భారీ స్థాయిలో విడుదల  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. దర్శకుడు కరుణాకరన్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాను రూపొందించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఇటీవల విడుదల చేసిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది .. ఈ వేడుకకి వైజాగ్ వేదిక కానుంది.

ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అక్కడి 'గురజాడ కళాక్షేత్రం'లో ఈ వేడుక జరగనుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా, జూలై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనీ .. తనకి తప్పకుండా హిట్ ఇస్తుందని తేజు భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి.   

More Telugu News