charan: తన పెళ్లిరోజు సందర్భంగా సన్నిహితులకు మామిడిపళ్లు పంపించిన చరణ్!

  • నిన్న చరణ్ .. ఉపాసనల పెళ్లి రోజు
  • డీవీవీ దానయ్య ఇంటికి మామిడి పండ్లు 
  • ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం  

నిన్న చరణ్ - ఉపాసన పెళ్లి రోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చరణ్ తన సన్నిహితులకు తమ తోటలో పండిన మామిడి పండ్లను బుట్టల్లో పంపించినట్టుగా తెలుస్తోంది. అలాగే నిర్మాత డీవీవీ దానయ్య ఇంటికి కూడా ఒక మామిడి పండ్ల బుట్ట వచ్చింది. 'స్వీటెస్ట్ కపుల్ నుంచి స్వీట్ మామిడి పండ్లు వచ్చాయి' అంటూ దానయ్య ఫేస్ బుక్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

నిర్మాత దానయ్యతో చరణ్ కి ఎంతో సాన్నిహిత్యం వుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'నాయక్' .. 'బ్రూస్ లీ' సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న సినిమాను కూడా దానయ్యే నిర్మిస్తున్నాడు. అందువలన ఆయనతో వున్న అనుబంధం కారణంగా చరణ్ మామిడి పండ్లను పంపించాడు. గతంలో పవన్ కల్యాణ్ ఇలా తన సన్నిహితులకు మామిడి పండ్లు పంపించేవాడనే సంగతి తెలిసిందే.

More Telugu News