ooty: ఘోర బస్సు ప్రమాదం.. నెత్తురోడిన ఊటీ!

  • 50 అడుగుల లోయలో పడ్డ బస్సు
  • ఏడుగురు దుర్మరణం
  • 8 మంది పరిస్థితి విషమం

ఎంతో ప్రశాంతంగా, కనువిందు చేసే ప్రకృతి అందాలతో నిత్యం పర్యాటకులతో అలరారే ఊటీ నెత్తురోడింది. ఈరోజు అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఊటీ నుంచి కూనూరు వెళ్లే మార్గంలో అదుపుతప్పిన ఓ ప్రభుత్వ బస్సు 50 అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 15 మంది గాయపడగా... వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతమంతా భయానకంగా ఉంది. ముక్కలైన బస్సు శకలాలు, రక్త చారికలతో పచ్చదనం ఎరుపువర్ణం దాల్చింది.  

More Telugu News