chiranjeevi: చిరూ .. కొరటాల సినిమా నిర్మాణంలోను చరణ్!

  • 'సైరా' షూటింగులో బిజీగా చిరూ 
  • నెక్స్ట్ మూవీ కొరటాలతో 
  • చిరూ ద్విపాత్రాభినయం

చిరంజీవి 150వ సినిమా నుంచి చరణ్ సొంత బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న 'సైరా' సినిమాకి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నిర్మాణంలోను చరణ్ భాగస్వామ్యం ఉందనేది తాజా సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ .. చరణ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారట. ఈ సినిమాలో చిరంజీవి రైతుగాను .. బిలియనీర్ గాను ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పక్కాగా తయారు చేసుకునే పనిలో కొరటాల వున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది ఆసక్తికరంగా మారింది.      

More Telugu News