jagan: జగన్ అవమానపరిచారు.. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తాం: ఏపీ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య

  • జగన్ వస్తారనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం
  • రాకుండా బ్రాహ్మణులను అవమానపరిచారు
  • బస్సు యాత్రలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తాం

రాజమండ్రిలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకుండా తమను వైసీపీ అధినేత జగన్ అవమాన పరిచారని ఏపీ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తమ సభకు వస్తారనే భరోసాతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని... ఈ సభకు 13 జిల్లాల నుంచి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తరలి వచ్చారని తెలిపారు. సభకు రాకుండా తమ మనోభావాలను జగన్ గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు జరిగిన అవమానానికి సంబంధించి రాజమండ్రిలోని ఓ హోటల్ లో బ్రాహ్మణ సంఘాల నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. జగన్ తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెండు రోజుల్లోగా వైసీపీ నేతలు స్పందించాలని, లేకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరించారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

More Telugu News