TTD: సుప్రీంకోర్టును ఆశ్రయించిన తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు

  • కేవియట్ పిటిషన్ దాఖలు
  • వచ్చే నెలలో సుప్రీంను ఆశ్రయిస్తానన్న రమణ దీక్షితులు
  • ఆయన కంటే ముందుగానే పిటిషన్ వేసిన వేణుగోపాల దీక్షితులు

టీటీడీలో రచ్చకెక్కిన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ ను దాఖలు చేశారు. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల కంటే ముందుగానే, వేణుగోపాల దీక్షితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. తనను అక్రమంగా ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించారని... దీనికి సంబంధించి వచ్చే నెలలో తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని రమణ దీక్షితులు ఇంతకు ముందు చెప్పిన సంగతి తెలిసిందే. 

More Telugu News