sudheer babu: 'సమ్మోహనం'లో సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి!: సుధీర్ బాబు

  • సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
  • కథానాయికగా అదితీరావు 
  • ఈ నెల 15వ తేదీన విడుదల

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు .. అదితీరావు జంటగా 'సమ్మోహనం' చిత్రం రూపొందింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ .. "మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి ఎప్పుడో పనిచేయవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. 'సమ్మోహనం'తో మా కాంబినేషన్ సెట్ కావడం సంతోషంగా వుంది. ఈ సినిమాలో నేను విజయ్ పాత్రలో కనిపిస్తాను .. నాకెంతో సంతృప్తినిచ్చిన ఈ పాత్ర .. నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఈ సినిమాలో హరీశ్ శంకర్ .. తరుణ్ భాస్కర్ .. అవసరాల డైరెక్టర్స్ గానే కనిపిస్తారు .. ఇది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News