Arvind Kejriwal: ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటిస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తాం: కేజ్రీవాల్

  • 2019 లోపు ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలి
  • ఒకవేళ మా డిమాండును పట్టించుకోకపోతే ఊరుకోం
  • ఢిల్లీని బీజేపీ వీడాలని ప్రజలు డిమాండ్ చేస్తారు

ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు శాసనసభలో ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ... ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని, అన్ని ఓట్లు ఆ పార్టీకే వేయాలని చెబుతామని అన్నారు. 2019 లోపు ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అన్నారు. ఒకవేళ తమ డిమాండును పట్టించుకోకపోతే ఢిల్లీని బీజేపీ వీడాలని ప్రజలు డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు. 

More Telugu News