Sridevi: కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌.. ఓదార్చిన జాన్వీ

  • 'ధడక్' సినిమా ట్రైలర్‌ విడుదల
  • వేడుకకు హాజరైన కపూర్‌ కుటుంబం
  • శ్రీదేవిని తలుచుకుని భావోద్వేగం

ధర్మ మూవీస్ బ్యానర్ పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఇషాన్ హీరోగా రూపొందుతోన్న 'ధడక్' సినిమా ట్రైలర్‌ ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమానికి అనిల్‌ కపూర్‌, బోని కపూర్‌లతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్‌ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు.

ఇక ఖుషీ కపూర్ తన తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్‌ ఓదార్చింది. దీంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.  

More Telugu News