sai dharam tej: 'తేజ్ ఐ లవ్ యూ' విడుదల వాయిదా!

  • కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • జూలై 6వ తేదీన విడుదల

ఫీల్ ఉండాలే గానీ .. ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. ఈ విషయాన్ని గతంలో వచ్చిన ఎన్నో ప్రేమకథలు నిరూపించాయి. అందువలన కరుణాకరన్ తనదైన శైలిలో 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాను రూపొందించాడు. సాయిధరమ్ తేజ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా, కేఎస్ రామారావు నిర్మాతగా ఈ సినిమా నిర్మితమైంది. ముందుగా ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ తేదీన ఈ సినిమాను విడుదల చేయలేకపోతున్నారట. జూలై 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత సాయిధరమ్ తేజ్ హీరోగా గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా రూపొందే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ ఆ పనిలోనే వున్నారని చెప్పుకుంటున్నారు.       

More Telugu News