Uttar Pradesh: శివాలయంలో సన్యాసిని ఇఫ్తార్ విందు.. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు

  • ప్రాచీన మన్‌కామేశ్వర్ ఆలయంలో విందు
  • ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది
  • గోమతీ నది ఒడ్డున కార్యక్రమం

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లో ఓ సన్యాసిని శివాలయంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. లక్నోలోని ప్రాచీన శివాలయాల్లో ఒకటైన మన్‌కామేశ్వర్ ఆలయంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. సన్యాసిని ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. గోమతీ నది ఒడ్డున జరిగిన ఈ కార్యక్రమానికి షియా, సున్నీ వర్గాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై విందు ఆరగించారు. ఇఫ్తార్ కోసం మందిరానికి చెందిన ముగ్గురు వంటవాళ్లు, వారి సహాయకులు ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు చేశారు.

More Telugu News