India: మహిళల ఆసియా కప్‌ టీ20 ఫైనల్‌: చివరి బంతిలో భారత్‌పై బంగ్లాదేశ్‌ అద్భుత విజయం

  • భారత్‌ స్కోర్‌- 112/9
  • బంగ్లాదేశ్‌- 113/7
  • భారత్‌పై మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం

మహిళల ఆసియా కప్‌లో భారత్‌కు మొట్టమొదటి సారిగా టైటిల్‌ దక్కలేదు. ఈరోజు మలేషియాలో జరిగిన ఫైనల్‌లో భారత్‌పై మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఏడు ఆసియా కప్‌ టోర్నీల్లో వరుసగా ఆరుసార్లు విజయం సాధించి తిరుగులేని జట్టుగా నిలిచిన భారత్‌ను ఈ టోర్నీలో ఓడించిన బంగ్లాదేశ్‌ క్రీడాకారిణులు మైదానంలో అమితానందంతో సంబరాలు చేసుకున్నాడు.

చివరి ఓవర్లో బంగ్లాదేశ్‌ 9 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బౌలింగ్‌ చేసింది. చివర్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి బంగ్లాదేశ్‌ విజయం సాధించాలంటే 2 పరుగులు చేయాల్సి ఉండగా, బ్యాటింగ్‌ చేస్తోన్న జహానరా అలాం ఆ బంతిని షాట్‌గా మలచి రెండు పరుగులు తీసి తమ దేశానికి విజయాన్ని అందించింది. భారత్‌ స్కోర్‌- 112/9, బంగ్లాదేశ్‌- 113/7.                           

More Telugu News