BigBoss: ‘బిగ్ బాస్’ సీజన్ 2లో పాల్గొనబోయేది వీరే.. టాలీవుడ్ నుంచే ఎక్కువ మంది!

  • నేటి నుంచే బిగ్‌బాస్ సీజన్ 2
  • సోషల్ మీడియాలో ఫైనల్ లిస్ట్ హల్‌చల్
  • సెలబ్రిటీల్లో చాలామంది టాలీవుడ్ నుంచే

నేటి నుంచి స్టార్ మా టీవీలో ‘బిగ్‌బాస్’ సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. 16 మంది సెలబ్రిటీలు వంద రోజుల పాటు ఒకే బిగ్ హౌస్‌లో ఉండనున్నారు. సీజన్ 1కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. మరికొన్ని గంటల్లో షో ప్రారంభం కాబోతున్నప్పటికీ అందులో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నది వీరేనంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  దాని ప్రకారం..

నటి రాశి, సింగర్ గీతా మాధురి, దీప్తి సునయన, యాంకర్ శ్యామల, టీవీ9 యాంకర్ దీప్తి, ధన్య బాలకృష్ణ, నటి గజాలా, నటి శ్రీదేవి, నటి/యాంకర్ వర్షిణి సౌందేరాజన్, నటులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీష్, ఆర్యన్ రాజేశ్, యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ కాకుమాను, జూనియర్ ఆర్టిస్ట్/కమెడియన్ వేణు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు.

మరి ఇదే ఫైనల్ లిస్టో, కాదో తెలియాలంటే మాత్రం కొన్ని గంటలు ఆగక తప్పదు. అయితే, ఈసారి మాత్రం సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ మంది సెలబ్రిటీలు పాల్గొంటున్న విషయం మాత్రం పక్కా అని తేలింది. దీంతో ఈసారి బిగ్‌బాస్ రసవత్తరంగా ఉండడం ఖాయమే అనాలి! 

More Telugu News