Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వాస్తవమే!: సీఎం కుమారస్వామిగౌడ

  • తిరుగుబాటు ఎమ్మెల్యేలను ‘కాంగ్రెస్’ గాడిలో పెడుతుంది
  • సరైన నిర్ణయం తీసుకుంటుంది
  • ఆ నమ్మకం నాకు ఉంది

కర్ణాటక కేబినెట్ లో శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. సీఎం కుమారస్వామి గౌడ ప్రభుత్వంపై 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామిగౌడ స్పందించారు.

బెంగళూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వాస్తవమేనని, సరైన నిర్ణయంతో తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పెడుతుందని, సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగి ఆ ఎమ్మెల్యేలతో జరిపిన చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.

More Telugu News