Nara Lokesh: 'ఈరోజు జగన్‌ ఎక్కడున్నాడో చెప్పుకోండి'.. మూడు ఆప్షన్లు ఇచ్చిన నారా లోకేశ్‌!

  • నాంపల్లి కోర్టు? 
  • లోటస్‌ పాండ్‌ మహల్‌?
  • బెంగళూరు మహల్‌?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ చురకలంటించారు. తాజాగా లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ... ఈరోజు శుక్రవారమని.. మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడ ఉంటారో చెప్పుకోండని ప్రశ్నించారు. అందుకోసం మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఈ కింది వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోండి అంటూ 1.నాంపల్లి కోర్టు... 2.లోటస్‌ పాండ్‌ మహల్‌.. 3.బెంగళూరు మహల్‌ అని పేర్కొన్నారు.

కాగా, ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడానికి నిన్న జగన్‌ తన పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చి హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. 

More Telugu News