Karnataka: ప్రజల్ని ఎంత కాలం పిచ్చివాళ్లను చేస్తారు..? పాలన ఎప్పుడు చేస్తారు?: ప్రకాష్ రాజ్ ప్రశ్నలు

  • బీజేపీ అధికారం, డబ్బుతో లాబీయింగ్ చేసింది
  • కాంగ్రెస్/జేడీఎస్ మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నాయి 
  • ఎంత కాలం ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తారు?

కర్ణాటక నేతలపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. కన్నడనాట రాజకీయాలను తన వ్యాఖ్యల్లో తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాజాగా పోస్ట్ పెట్టారు. ‘‘కర్ణాటక రాజకీయాలు..!! ఒక పార్టీ బీజేపీ డబ్బు, అధికారంతో లాబీయింగ్ కు ప్రయత్నించింది... మీరు కాంగ్రెస్/జేడీఎస్ నేతలు మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నారు... రెండు మార్గాల్లోనూ మీరందరూ మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు. ఎంత కాలం పాటు మీరు పౌరులను పిచ్చివాళ్లను చేస్తారు? ఎప్పుడు పరిపాలన చేస్తారు?’’ అని ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో కడిగి పారేశారు.

More Telugu News