Chandrababu: చంద్రబాబు, జగన్ కుమ్మక్కయ్యారు: సీపీఐ నేత రామకృష్ణ

  • చంద్రబాబు, జగన్ వి లాలూచీ రాజకీయాలు
  • వీళ్లిద్దరికీ మోదీ అంటే భయం
  • వైసీపీవి రాజీనామాలు కాదు రాజీ - డ్రామాలు

సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ కుమ్మక్కై లాలూచీ రాజకీయం చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి సమావేశం ఈరోజు విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు.

చంద్రబాబునాయుడు తన అసంతృప్తినంతా బీజేపీపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, తన పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీల రాజీనామాల గురించి ఆయన విమర్శలు చేశారు. ఇవి నిజమైన రాజీనామాలు కాదని, ‘రాజీ-డ్రామాలు’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్ లకు మోదీ అంటే భయమని అన్నారు. ఈ నెల 20న విజయవాడలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు.

More Telugu News