Hyderabad: హైదరాబాద్‌లో జగన్‌తో రమణ దీక్షితులు భేటీ!

  • లోటస్‌పాండ్‌కు వచ్చిన రమణ దీక్షితులు
  • జగన్‌తో కాసేపు సమావేశం 
  • చర్చనీయాంశంగా మారిన భేటీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ఈ రోజు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కలిశారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.

మరోవైపు జగన్‌ ఈ విషయంపై ఇటీవల స్పందించి.. రమణ దీక్షితులు ప్రశ్నించినందుకు మొత్తం అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైంది కాదని అన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన భేటీ చర్చనీయాంశంగా మారింది.     

More Telugu News