keerti suresh: సావిత్రిగా కీర్తి సురేశ్ అభినయం అద్భుతం: చరణ్

  • నాగ్ అశ్విన్ అంకితభావం నచ్చింది 
  • కీర్తి సురేశ్ ను మించి ఎవరూ చేయలేరు 
  • నిర్మాతల ప్రయత్నం అభినందనీయం  

కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' .. మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలోను .. ఓవర్సీస్ లోను నీరాజనాలు పడుతున్నారు. 'మహానటి' చూసిన సినీ ప్రముఖులంతా ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే. బిజీగా ఉండటం వలన కాస్త ఆలస్యంగా చరణ్ ఈ సినిమా చూశాడు. 'మహానటి' చూసిన వెంటనే ఆయన తనదైన శైలిలో ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. 'మహానటి' సినిమా నా మనసును ఎమోషనల్ గా టచ్ చేసింది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండల నటన కూడా ఎంతో సహజంగా వుంది. ఇంతగొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకి శుభాకాంక్షలు" అని రాసుకొచ్చాడు.

More Telugu News