akhil: జిమ్ ఓపెనింగ్ కు వచ్చిన అఖిల్.. ఎంత వసూలు చేశాడో తెలుసా?

  • హైదరాబాదులో ఓ జిమ్ ఓపెనింగ్ కు వచ్చిన అఖిల్
  • పావు గంటకు రూ. 8 లక్షలు వసూలు
  • సినిమాలు బోల్తాపడ్డా.. తగ్గని బ్రాండ్ వాల్యూ

అక్కినేనివారి వారసుడు అఖిల్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా, యూత్ లో అఖిల్ కు మంచి క్రేజ్ ఉంది. దీంతో, అఖిల్ బ్రాండ్ వాల్యూ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఏదైనా షాప్ ఓపెనింగుకు వస్తే లక్షలు వసూలు చేస్తున్నాడట ఈ యంగ్ హీరో.

ఇటీవలే హైదరాబాదులో ఓ జిమ్ ఓపెనింగ్ కు అఖిల్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా హాజరైంది. ఈ ఓపెనింగ్ ఫంక్షన్ లో అఖిల్ కేవలం పావుగంట మాత్రమే ఉన్నాడు. కానీ రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడట. హీరో అవ్వక ముందే మౌంటైన్ డ్యూ, టైటాన్ వాచ్ లకు అఖిల్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ఆ తర్వాత పలు యాడ్స్ లో యాక్ట్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ కు పెద్ద సంఖ్యలోనే ఫాలోయర్లు ఉన్నారు.

More Telugu News