kancha ilaiah: తెలంగాణ కౌలు రైతులు 4 వేలు తక్కువ కౌలు కట్టండి: కంచ ఐలయ్య పిలుపు

  • రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం
  • కౌలు రైతులకు అన్యాయం చేయవద్దని రైతులను కోరిన ఐలయ్య
  • పేదల భూములు భూస్వాముల చేతుల్లోకి పోయాయంటూ ఆవేదన

రైతు బంధు పథకం ద్వారా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చే కౌలు మొత్తంలో కౌలు రైతులు ఎకరాకు రూ. 4 వేలు తక్కువ చెల్లించాలని కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. కౌలు రైతులకు రైతులు అన్యాయం చేయకూడదని అన్నారు. ఒకప్పుడు పేదలకు కమ్యూనిస్టులు భూములను పంచారని... ఇప్పుడు ఆ భూములన్నీ భూస్వాముల చేతుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, రజకులు తదితర కులాలకు అతి తక్కువ భూమి ఉందని అన్నారు. 

More Telugu News