balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ స్క్రీన్ ప్లే పై క్రిష్ కసరత్తు

  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ 
  • దర్శకుడిగా రంగంలోకి క్రిష్ 
  • నటీనటుల ఎంపికపై దృష్టి    

'ఎన్టీఆర్' బయోపిక్ ను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో బాలకృష్ణ వున్నారు. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకోవడంతో, ఆ స్థానంలోకి క్రిష్ వచ్చారు. గతంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో బాలకృష్ణకి హిట్ ఇచ్చి ఉండటం వలన ఈ అవకాశం ఆయనకి వెళ్లింది. బాలకృష్ణ .. ఎన్టీఆర్ అభిమానులు ఆశించే స్థాయిలో ఈ సినిమా చేయడానికి తనవంతు కృషి చేస్తానని క్రిష్ చెప్పారు.

ఈ సినిమా కోసం సిద్ధం చేసిన కథలో క్రిష్ మార్పులు చేస్తున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే కథ విషయంలో ఎలాంటి మార్పులను తాను చేయబోవడం లేదనీ, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నానని క్రిష్ అన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే కసరత్తు జరుగుతోందనీ .. అది పూర్తయిన తరువాత బాలకృష్ణకి చూపించి .. ఆయన అభిప్రాయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.    

More Telugu News