sudheer babu: 'సమ్మోహనం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మహేశ్ బాబు

  • సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
  • ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 15వ తేదీన సినిమా విడుదల

వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తొన్న మోహనకృష్ణ ఇంద్రగంటి, తన తాజా చిత్రంగా 'సమ్మోహనం' రూపొందించాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో, సుధీర్ బాబు .. అదితీరావు జంటగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మహేశ్ బాబు హాజరుకానున్నాడు. ప్రధాన తారాగణంతో పాటు దర్శక నిర్మాతలు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు వున్నాడు.     

More Telugu News