Shilpa Shetty: బిట్ కాయిన్ స్కామ్ లో శిల్పాశెట్టి భర్త... ఈడీ నోటీసులు!

  • రాజ్ కుంద్రాకు నోటీసుల చేరవేత
  • ఆయన్ను ప్రశ్నించాలని భావిస్తున్న ఈడీ
  • భారత్ లోని బిట్ కాయిన్ నెట్ వర్క్ లో కుంద్రాకు భాగస్వామ్యం ఉందని ఆరోపణలు

అంతర్జాతీయ ఊహాజనిత కరెన్సీ బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. ఈ కేసులో రాజ్ కుంద్రాకు సంబంధముందని గతంలోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్న ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు చేరవేశారు.

ఓ భారీ నెట్ వర్క్ గా ఏర్పడి, కంప్యూటర్ ద్వారా గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారన్న సంగతి తెలిసిందే. దీనికి ఎటువంటి చట్టబద్ధతా లేనప్పటికీ, గత సంవత్సరంలో ఓ వెలుగు వెలిగిన బిట్ కాయిన్ విలువ, ఆపై కుదేలైన సంగతి తెలిసిందే. లక్సంబర్గ్ కేంద్రంగా నడుస్తున్న బిట్ స్టాంప్ ఎక్స్ఛేంజ్ ఈ లావాదేవీలను నిర్వహిస్తుండగా, భారత్ లో కొంతమంది చైన్ గా ఏర్పడి బిట్ కాయిన్ లావాదేవీలు ప్రారంభించి, ప్రజలను మోసం చేశారు. ఈ కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తుండగా, రాజ్ కుంద్రాకు నోటీసులు రావడం గమనార్హం.

More Telugu News