apoorva: సినీ నటి అపూర్వకు చెందిన భూమి కబ్జా.. పోలీసులకు ఫిర్యాదు!

  • పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నాలుగెకరాల భూమి కబ్జా
  • పోలీసులను ఆశ్రయించిన అపూర్వ
  • రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్న పోలీసులు

తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారంటూ సినీ నటి అపూర్వ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, దెందులూరులో తనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇటీవలే తమ భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి సరిహద్దుల్లో రాళ్లు పాతించామని చెప్పారు. మరుసటి రోజే చుట్టు పక్కల ఉన్న రైతులు ఆ రాళ్లను తొలగించి, భూమిని ఆక్రమించారని తెలిపారు. ఈ కబ్జా వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ, ఇది సివిల్ వ్యవహారమని, భూమి సరిహద్దుల విషయాన్ని ఎమ్మార్వో చూసుకుంటారని చెప్పారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

More Telugu News