Telangana: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్!

  • ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మె
  • ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనలు
  • 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక దీక్షలు

ఈనెల 11 నుంచి తాము నిరవధిక సమ్మెకు దిగుతున్నామని తెలంగాణలోని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేశాయి. అలాగే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నాయి. ఆర్టీసీ సంఘాలు కొంత కాలంగా వేతన సవరణ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమైన టీఎస్ ఆర్టీసీ సంఘాల కేంద్ర కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుని ఈ విషయాన్ని ప్రకటించింది.

యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తామని, 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. 

More Telugu News