nagachaitanya: 'సవ్యసాచి'లో భూమిక పాత్ర కోసం రెండు వెర్షన్లు!

  • చందూ మొండేటితో చైతూ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • అదనంగా కామెడీ సీన్స్ చిత్రీకరణ        

చందూ మొండేటి .. నాగచైతన్య కాంబినేషన్లోని రెండవ సినిమాగా 'సవ్యసాచి' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో విలన్ గా మాధవన్ నటిస్తుండగా .. చైతూ అక్కయ్య పాత్రను భూమిక పోషిస్తోంది. భూమికను ప్రేమించే వ్యక్తిగాను .. ద్వేషించే వ్యక్తిగాను మాధవన్ పాత్ర వుంటుందట.ఈ సినిమాలోని ఒక కీలకమైన సన్నివేశంలో భూమిక గాయపడుతుంది. ఆ సంఘటన తరువాత ఆమె పాత్ర మరణించేలా చేస్తే బాగుంటుందా? .. కోమాలోకి వెళితే బాగుంటుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదట. అందువల్ల ఈ రెండు వెర్షన్లను షూట్ చేసి .. డబ్బింగ్ కూడా చెప్పించేస్తున్నారని వినికిడి. ఇక రెండవ భాగంలో ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎక్కువైనట్టుగా అనిపించడంతో, కొన్ని కామెడీ సీన్స్ ను కూడా జోడిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో చైతూ జోడీగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.        

More Telugu News