varun tej: డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తోన్న మెగాహీరో

  • సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్
  • ప్రత్యేకమైన సెట్ లో భారీ సీన్స్ చిత్రీకరణ 
  • హీరోయిన్స్ గా లావణ్య త్రిపాఠి .. అదితీరావు  

ప్రస్తుతం వరుణ్ తేజ్ .. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. వ్యోమగామిగా వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి .. అదితీరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్నారు. అంతరిక్ష పరిశోధనకి సంబంధించిన నేపథ్యంలోని కథ కావడంతో, భారీ బడ్జెట్ తో ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.

 ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న వరుణ్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. సహజత్వం కోసం ఆయన డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నారట. దాంతో మెగాహీరో విషయంలో యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరిస్తోన్న సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు.    

More Telugu News