ipl: ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్న సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌

  • ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో బెట్టింగ్ స్కామ్‌
  • బెట్టింగ్‌లో రూ.2.8 కోట్లు కోల్పోయిన అర్బాజ్‌ఖాన్‌
  • థానే పోలీసుల విచారణ

ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్ స్కామ్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌కు మహారాష్ట్రలోని థానే పోలీసులు సమన్లు జారీ చేయగా, ఆయన హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను బెట్టింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.

బెట్టింగ్‌ బుకీ సోనుకి, తనకు గత ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని అర్బాజ్ ఖాన్‌ ఒప్పుకున్నట్లు తెలిసింది. సోనుతో ఆయన చేసిన చాటింగ్‌, ఇతర బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు పోలీసులకు లభ్యమయ్యాయి. అలాగే, గతేడాది తాను ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌ లో రూ.2.75 కోట్లు నష్టపోయానని అర్బాజ్ అంగీకరించాడు.

కాగా, ఇటీవల జరిపిన విచారణలో సోను అర్బాజ్‌ఖాన్‌ పేరును బయటపెట్టి, ఆయన బెట్టింగ్‌లో రూ.2.8 కోట్లు కోల్పోయాడని చెప్పాడు. చివరకు డబ్బు ఇవ్వకపోవడంతో ఆయనను తాను బెదిరించానని తెలిపాడు.         

More Telugu News