Chandrababu: టీడీపీలో చేరండి... ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబును స్వయంగా ఆహ్వానించిన చంద్రబాబు

  • మరో ఏడాదిలో రిటైర్ కానున్న అశోక్ బాబు
  • అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చూస్తున్న చంద్రబాబు
  • బాబు ఆహ్వానం ఆశ్చర్యాన్ని కలిగించిందన్న అశోక్ బాబు

ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబును తెలుగుదేశం పార్టీలో చేరాలని సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. మరో ఏడాదిలో అశోక్ బాబు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించాలని, వచ్చే ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఆయన్ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, చంద్రబాబు ఆహ్వానం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్జీవో నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్టు అశోక్ బాబు ఈ ఉదయం విజయవాడలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఉద్యోగులకు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, తప్పకుండా చేస్తానని చెప్పిన ఆయన, అది ఏ రూపంలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని, భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.

More Telugu News