stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

  • 95 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ‌ 
  • 35,227 వద్ద ముగింపు
  • 40 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 
  • 10,696 వద్ద ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, టెక్నాలజీ రంగాల షేర్లు కుదేలు అవడంతో 95 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 35,227 వద్ద ముగియగా, 40 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10,696 వద్ద ముగిసింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో మదుపర్లు లాభాల స్వీకరణ వైపునకు మళ్లడంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయని విశ్లేషకులు పేర్కొన్నారు.  

బీఎస్‌ఈ టాప్‌ గెయినర్స్‌: హీరోమోటార్స్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ, ఎయిర్‌టెల్‌.

లూజర్స్‌: ఐషర్ మోటార్స్‌, టాటాస్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్జీసీ.

More Telugu News