smartphone: అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసిన షియోమీ!

  • తాజాగా నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ విడుదల
  • వచ్చే నెల 5 నుంచి చైనా మార్కెట్‌లోకి
  • బ్లాక్, బ్లూ, గోల్డ్, వైట్ కలర్ వేరియెంట్‌లలో లభ్యం

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండే ఇన్‌ఫ్రారెడ్ సహాయంతో యూజర్ ముఖంతోనే అన్‌లాక్ (3డీ ఫేస్ అన్‌లాక్) చేయవచ్చు. బ్లాక్, బ్లూ, గోల్డ్, వైట్ కలర్ లలో లభ్యం అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ లు వచ్చే నెల 5 నుంచి చైనా మార్కెట్‌లోకి, ఆ తరువాత ఇతర దేశాలలోకి అందుబాటులోకి రానున్నాయి. కాగా, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్ రూ.28,600.. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్ రూ.31,600.. 6 జీబీ ర్యామ్‌, 256 జీబీ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్ రూ.34,800 లుగా నిర్ణయించారు.

ఎంఐ 8/ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఫీచర్లు:

  • 6.21" ఫుల్‌ స్క్రీన్‌
  • 12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ బ్యాక్ కెమెరా
  • 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌, ఫేస్‌ అన్‌లాక్‌
  • వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ
  • 6 జీబీ ర్యామ్‌
  • 64 జీబీ/128 జీబీ/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
  • 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో ఎక్స్‌ప్లోర్‌ ఎడిషన్‌
  • 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

More Telugu News