Mahesh Babu: కోటీశ్వరుడిగా మహేశ్ బాబు .. పేదవాడైన స్నేహితుడిగా అల్లరి నరేశ్

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు 
  • నిర్మాతలుగా దిల్ రాజు .. అశ్వనీ దత్ 
  • తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో  

మహేశ్ బాబు 25వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును వచ్చేనెల 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. మహేశ్ బాబు స్నేహితుడిగా కనిపిస్తాడట. కోటీశ్వరుడిగా మహేశ్ బాబు కనిపిస్తే, పేదవాడైన ఆయన ప్రాణ మిత్రుడిగా అల్లరి నరేశ్ పాత్ర వుంటుందట. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్ ను ఫైనలైజ్  చేశారట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్న సంగతి తెలిసిందే.    

More Telugu News