sai dharam tej: 'ఛలో' దర్శకుడితో సాయిధరమ్ తేజ్?

  • కిషోర్ తిరుమలతో సాయిధరమ్ తేజ్ 
  • లైన్లో గోపీచంద్ మలినేని 
  • మరో వైపున గీతా ఆర్ట్స్ కి గ్రీన్ సిగ్నల్    

ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో మంచి మార్కులు కొట్టేసినదిగా 'ఛలో' కనిపిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. టేకింగ్ పరంగా వెంకీ కుడుములకి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన తదుపరి చిత్రం సాయిధరమ్ తో ఉండనుందని సమాచారం.

వెంకీ కుడుముల కథ వినిపించడం .. తేజు ఓకే చెప్పడం .. ఈ సినిమాను నిర్మించడానికి గీతా ఆర్ట్స్ వారు ముందుకు రావడం జరిగిపోయాయని అంటున్నారు. కథా కథనాల విషయంలో గీతా ఆర్ట్స్ వారు ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడతారో తెలిసిందే. 'తేజ్ ఐ లవ్ యు' సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న సాయిధరమ్ తేజ్, ఆ తరువాత కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాతనే ఒక వైపున గోపీచంద్ మలినేనికి .. మరో వైపున వెంకీ కుడుములకి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ రెండు సినిమాలలో ఆయన ఏ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళతాడో చూడాలి మరి.  

More Telugu News