New Delhi: మిస్టరీ! బైకును ఢీకొట్టిన కారు.. అదృశ్యమైన బైకర్, కారు డ్రైవర్.. తలలు పట్టుకుంటున్న పోలీసులు!

  • డీఎన్‌డీ ఫ్లైవేపై ప్రమాదం
  • మిస్టరీగా మారిన డ్రైవర్ల అదృశ్యం
  • చిన్న క్లూ కూడా దొరకని వైనం

ఢిల్లీలోని డీఎన్‌డీ ఫ్లైవేపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పోలీసులకు మిస్టరీగా మారింది. హార్లీడేవిడ్‌సన్ బైక్‌ను టొయోటా కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత నుజ్జునుజ్జు అయిన వాహనాలు ఘటనా స్థలంలో ఉన్నాయి కానీ, బైకర్, కారు డ్రైవర్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగి 24 గంటలైనా వారికి సంబంధించిన చిన్న ఆధారం కూడా లభించలేదని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో యమునా నదిలో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.

సరితా విహార్‌కు చెందిన అన్షుమన్ పురిని బైక్ యజమానిగా గుర్తించారు. అక్కడకు వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో అన్షుమన్ ఒక్కడే ఉంటాడని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఖతార్ విహార్‌కు చెందిన బప్పాసింగ్‌ను కారు డ్రైవర్‌గా గుర్తించారు. గోయల్ డెయిరీ పేరుపై కారు రిజిస్టర్ అయి ఉంది. అతడి ఇంటికి వెళ్లిన పోలీసులకూ నిరాశే ఎదురైంది. ఆ ఇల్లు కూడా తాళం వేసి ఉంది. అతడు కెనడాలో ఉంటాడని, కుమార్తె, అల్లుడు మాత్రమే ఇక్కడ ఉంటారని చుట్టుపక్కల వారు తెలిపారు. కారును అల్లుడే ఉపయోగిస్తున్నాడని చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

More Telugu News