delhi: ప్రధాని మోదీని కలిసిన సీఎం కుమారస్వామి!

  • ఢిల్లీలో మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన కుమారస్వామి
  • సీఎం హోదాలో తొలిసారిగా మోదీని కలిశానన్న గౌడ
  • కాంగ్రెస్ పార్టీ నేతలనూ కలిసిన కర్ణాటక ముఖ్యమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామిగౌడ ఈరోజు సాయంత్రం కలిశారు. అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన కలిశారు. కొత్త మంత్రి వర్గం ఏర్పాటు, శాఖల కేటాయింపుతో పాటు పలు ముఖ్యమైన విషయాలపై ఆయన చర్చించారు. అయితే, వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా, ఆమెతో పాటు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారు. దీంతో, వారిని కుమారస్వామి కలుసుకోలేకపోయారు. అనంతరం, మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే పీఎం మోదీని తాను కలిశానని చెప్పారు. సీఎం హోదాలో మోదీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. 

More Telugu News