madala ranga rao: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదాల భౌతికకాయం

  • మాదాల భౌతికకాయానికి నివాళులర్పించిన వామపక్ష నేతలు
  • అధిక సంఖ్యలో హాజరవుతున్న అభిమానులు
  • ఈరోజు సాయంత్రం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన విప్లవనటుడు మాదాల రంగారావు నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ముగ్ధూం భవన్ నుంచి బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలించారు. మాదాల భౌతికకాయానికి సీపీఎం నేతలు రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నారాయణ, చాడ వెంకటరెడ్డి, పలువురు ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో మాదాల రంగారావు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News