csk: ధోనీ సేనకు అచ్చొచ్చిన వాంఖడే స్టేడియం

  • ఈ సీజన్ లో ఇదే వేదికపై మూడు మ్యాచులు
  • మూడు సార్లూ విజయం కింగ్స్ దే
  • నంబర్ 7 కలిసొచ్చిందన్న ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ముంబైలోని వాంఖడే స్టేడియం బాగా కలిసొచ్చింది. ముచ్చటగా మూడు సార్లు ఈ ఐపీఎల్ సీజన్ లో సూపర్ కింగ్స్ గా నిలబెట్టింది ఈ మైదానమే. నిన్న జరిగిన ఫైనల్స్ లో ప్రత్యర్థి జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి ముచ్చటగా మూడోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ లను ఈ సీజన్ లో వాంఖడే స్టేడియంలో సూపర్ కింగ్స్ ఆడగా, మూడింటిలోనూ విజయం వరించింది. అయితే, కెప్టెన్ ధోనీ మాత్రం తనకు నంబర్ 7 సెంటిమెంట్ అచ్చొచ్చిందని చెప్పడం విశేషం.

More Telugu News