Vijayawada: విజయవాడలో శ్వేతాంబర జైనుల మహా ర్యాలీ!

  • సమాజంలో హింస కూడదన్న సందేశం
  • ఆచార్య మహాశ్రమన్ జీ ఆధ్వర్యంలో ర్యాలీ
  • పాల్గొన్న గద్దె రామ్మోహన్, గౌతమ్ సవాంగ్

సమాజంలో హింస కూడదని, హింసా మార్గాన్ని విడనాడాలని చెబుతూ, శ్వేతాంబర జైనుల మహా ర్యాలీ విజయవాడలో జరిగింది. శ్వేత వస్త్రధారులైన జైనులు వందలాదిగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తేరాపంత్ పీణాధిపతి ఆచార్య మహాశ్రమన్ జీ ఆధ్వర్యంలో ర్యాలీ సాగగా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక గురునానక్ కాలనీ నుంచి మొగల్రాజపురం వరకూ ఈ అహింసా ప్రదర్శన సాగగా, ట్రాఫిక్ కు అవాంతరాలు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News