akhil: అఖిల్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్!

  • వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ
  • కథానాయికగా నిధి అగర్వాల్
  • లండన్ లో తొలి షెడ్యూల్  

అఖిల్ తన మూడవ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. తొలి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసుకున్నారు.

 ప్రస్తుతం నాగచైతన్య సరసన 'సవ్యసాచి' చేస్తోన్న నిధి అగర్వాల్, ఆ తరువాత సినిమాను అఖిల్ తో చేయనుండటం విశేషం. ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఖరారైపోవచ్చునని అంటున్నారు. గతంలో నాగార్జున చేసిన 'హలో బ్రదర్' నుంచి 'హలో' టైటిల్ తీసిన అఖిల్, ఈ సారి కూడా నాగార్జున హిట్ మూవీ అయిన 'మజ్ను' టైటిల్ ను తీసుకుని దానికి ముందు మిస్టర్ ను కలుపుకున్నాడు. వచ్చేనెల రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.   

More Telugu News